టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించిన తర్వాత అన్ని స్థానాల్లోనూ ఏదో ఒకరకంగా రచ్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించని ఏరియాల్లో సైతం గొడవలు మొదలయ్యాయి. స్థానికులను విస్మరించి బయటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేస్తే సహించేదిలేదంటూ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు ఓపెన్గా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులను కూడా వివిధ కారణాలతో అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం.
జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికింది. పి.గన్నవరం అభ్యర్ధిగా మహాసేన రాజేష్ పేరును ప్రకటించడంతో.. స్థానిక నేతలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహాసేన రాజేష్ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయకమటీ సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. రాజేష్ కు పి.గన్నవరం టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనపట్ల తీవ్రస్థాయిలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చూసిన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇదే జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలోని పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రమణ్యం ఇక్కడ ఇంఛార్జిగా ఉన్నా, ఆయనను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకే సీటు దక్కతుందనే ఆలోచనతో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని రెడ్డి సుబ్రమణ్యం తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వం అసలు అభ్యర్ధినే ప్రకటించకుండా...సుభాష్ తానే అభ్యర్ధిలా వ్యవహరించడంపట్ల సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోపాటు ప్లెక్సీలు, బ్యానర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు.
మరోవైపు అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకుండానే రామచంద్రాపురం నియోజకవర్గానికి రెడ్డి సుబ్రమణ్యం సతీమణి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో రగడ చెలరేగింది. చివరకు ఈ విషయం తనకు తెలియదని, పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని రామచంద్రాపురం ఇంఛార్జి రెడ్డి సుబ్రమణ్యం స్పష్టం చేశాకే జనసేన వర్గాలు శాంతించాయి.
తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది
Published Sun, Mar 10 2024 9:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement