నా రాజీనామా ఊహాగానమే | Sakshi
Sakshi News home page

నా రాజీనామా ఊహాగానమే

Published Sun, Dec 31 2023 2:51 AM

Telangana Governor Tamilisai denies rumours over resignation - Sakshi

సాక్షి హైదరాబాద్‌/కంటోన్మెంట్‌: తాను గవర్నర్‌గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని గవర్నర్‌ తమిళిసై స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని అనురాధా టింబర్స్‌ను సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్‌గా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు శ్రీరాముడితో పాటు ప్రధాన మంత్రి మోదీ చేతుల్లో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

పూల బొకేలు వద్దు.. బుక్స్‌ తీసుకురండి 
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ సోమవారం ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులను గవర్నర్‌ ఆహ్వనించినట్టు తెలిసింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌ బుక్స్, పెన్నులను తీసుకురావాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement