సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిందిగా సీఎం కేసీఆర్ను కొందరు టీఆర్ఎస్ ఎంపీలు కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2,3 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన లేదా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి పార్ల్లమెంటు సమావేశాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించడంతో పాటు వివిధ అంశాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం, టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్రపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హక్కులు హరిస్తున్న కేంద్రం
‘దేశ రాజకీయాలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. కొత్త రాష్ట్రమైనా మనం తెలంగాణను బలంగా అభివృద్ధి చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సాయం లేకున్నా అభివృద్ధి బాటలో సాగుతున్నాం. అయితే రాష్ట్రాన్ని బలహీన పరిచేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం మన హక్కులను హరించి వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయినా టీఆర్ఎస్ వల్లే తెలంగాణ ఈ రోజు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. రాష్ట్రాలకు వాటా మేరకు నిధుల కేటాయింపులు జరగడం సహజమే అయినా, కొత్త రాష్ట్రానికి ఎలాంటి అదనపు సాయం లేదు. దేశ రాజకీయాలపై ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నాం. సరైన సమయంలో స్పందిస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
సాగునీటి విషయంలో అన్యాయం జరక్కూడదు
‘సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదు. లోక్సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలి. గట్టిగా కొట్లాడాలి. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలి. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలి..’ అని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించి సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించండి: కేసీఆర్కు ఎంపీల విజ్ఞప్తి
Published Sat, Jul 17 2021 1:56 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement