కేసీఆర్‌ది నీచమైన పాలన: ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది నీచమైన పాలన: ఉత్తమ్‌

Published Mon, Mar 21 2022 3:08 AM

Uttamkumar Reddy Fires On CM KCR - Sakshi

తూప్రాన్‌: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నీచ మైన, దుర్మార్గమైన పాలన కొనసాగిస్తు న్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చేరుకున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఉత్తమ్‌  పాల్గొన్నారు. పోత రాజుపల్లి చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి లభించిందన్నారు. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం ద్వారా ఆ పార్టీ నాయకులకు వేల కోట్లు దోచిపెడు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ దళితుల అభ్యున్నతి కోసం ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానని గద్దెనెక్కారని, ఇప్పటికీ ఎనిమిదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఇవ్వలేదని విమ ర్శించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  

Advertisement
Advertisement