ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్‌

Published Sat, Mar 9 2024 7:53 PM

Ysrcp Chief Ys Jagan Is Preparing For The Election Campaign - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. రానున్న 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారానికి సిద్ధం చేశారు. రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్‌షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సభలు, రోడ్ షోలపై ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించారు. కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ సీఎం జగన్‌ ప్రచారం చేయనున్నారు. మరోవైపు మేనిఫెస్టో తుది దశకు చేరుకుంది. తన ప్రచారంలో మేనిఫెస్టో గురించి విస్తృతంగా  చెప్పనున్నారు.

మరోవైపు "స్టార్ క్యాంపెయినర్ల" సాక్షిగా రేపు(ఆదివారం) బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో సిద్ధం సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వ లబ్ది పొందిన పేదలే వైఎస్సార్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ గతంలోనే సీఎం జగన్‌ ప్రకటించారు. "నా కల.. పేరుతో ప్రచారాన్ని రేపు అధికారికంగా పార్టీ అధినేత ప్రారంభించునున్నారు. 43 నియోజకవర్గాల నుండి కార్యకరర్తలు హాజరుకానున్నారు. సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా.

ఇదీ చదవండి: బాబు కన్నింగ్‌.. ఏపీ బీజేపీ గగ్గోలు ! 

Advertisement
Advertisement