టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే..

Published Mon, Oct 30 2023 1:46 AM

-

నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్‌ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్‌, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ సురేష్‌ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement