సీఎం జగన్‌తో ఎమ్మెల్యే బాలినేని భేటీ | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో ఎమ్మెల్యే బాలినేని భేటీ

Published Fri, Nov 3 2023 2:48 AM

- - Sakshi

ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో గురువారం ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. ఒంగోలు నగరంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూమికి ఇవ్వాల్సిన పరిహారాన్ని వెంటనే భూ యజమానులకు అందించేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. దాంతో పాటు ఒంగోలు నగరంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించేందుకు పైపులైన్ల మార్పు, నూతన ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని సీఎంను బాలినేని కోరారు. భూ యజమానులకు చెల్లించాల్సిన నిధులను త్వరలో విడుదల చేస్తామని, ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు పైపులైన్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఒంగోలు వస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని బాలినేని తెలిపారు. నియోజకవర్గంలోని పలు అంశాలు, రాజకీయ పరిణామాల గురించి సీఎంకు వివరించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement