ఆరోగ్యశ్రీ ద్వారా పునర్జన్మ ప్రసాదించారు | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ద్వారా పునర్జన్మ ప్రసాదించారు

Published Mon, Nov 20 2023 2:04 AM

- - Sakshi

నేను నాలుగు నెలల కిందట గుండె సంబంధిత అనారోగ్యానికి గురయ్యాను. గుండె బలంగా ఉండాలంటే లోపల మిషన్‌ ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు. అందుకు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి దృష్టికి నా కుటుంబ సభ్యులు సమస్యను తీసుకెళ్లారు. ఆయన స్పందించి ఆరోగ్యశ్రీ ద్వారా సీఎంఓ ఆఫీస్‌ నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. విజయవాడ మణిపాల్‌ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేశారు. గుండెకు మిషన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. పేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో తోడ్పడుతోంది. ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటా.

– నాగం సుబ్బయ్య, గొట్లగట్టు, కొనకనమిట్ల మండలం

జనగళం

Advertisement
Advertisement