చీమకుర్తిలో అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ఠ | Sakshi
Sakshi News home page

చీమకుర్తిలో అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ఠ

Published Mon, Nov 20 2023 2:04 AM

అయ్యప్పస్వామిని ఊరేగింపుగా తీసుకొస్తున్న శిద్దా సుధీర్‌, రాఘవరావు   - Sakshi

చీమకుర్తి: చీమకుర్తి హరిహరక్షేత్రంలో ఆదివారం అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి దంపతులతో పాటు టీటీడీ పాలకమండలి సభ్యుడు శిద్దా సుధీర్‌కుమార్‌ సమక్షంలో అయ్యప్పస్వామికి విశేష అభిషేకాలు చేసి కలశ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహరక్షేత్రంలోని సకల దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం సర్వ మాలధారులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిద్దా పాండురంగారావు, కుటుంబ సభ్యులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement