దేదీప్యం.. | Sakshi
Sakshi News home page

దేదీప్యం..

Published Tue, Nov 28 2023 1:30 AM

- - Sakshi

కొత్తపట్నం సముద్ర తీరంలో కార్తీక స్నానాలు చేస్తున్న భక్తజన సందోహం

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ, ఈతముక్కల, పాకల, మడనూరు తదితర సముద్ర తీరప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకతో శివలింగాలకు రూపమిచ్చి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీప కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. జిల్లాలో ప్రముఖ ఆలయాలైన త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెం, మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయం, కొత్తపట్నం శివాలయం, ఒంగోలు కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల్లో దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో స్వామిని అర్చించారు.

త్రిపురాంతకంలో ప్రత్యేక అలంకరణలో

త్రిపురాంతకేశ్వర స్వామి

కొత్తపట్నం సముద్ర తీరంలో కార్తీక దీపాలతో యువతులు

భైరవకోనలో స్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు

ఒంగోలులోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

యర్రగొండపాలెం కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం

– సాక్షి నెట్‌వర్క్‌

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement