ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి

Published Mon, Dec 18 2023 12:56 AM

- - Sakshi

నాడు–నేడుతో దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలు మారాయి. నాడు విద్యార్థులు కూర్చోవడానికి గదులు సరిపడలేదు. చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు బోధించేవారు. నేడు అలాంటి సమస్య లేకుండా అదనపు తరగతి గదులు నిర్మించారు. పాఠశాలల్లోనే బాలికలకు ప్రత్యేక హాస్టల్‌ వసతి కల్పించారు. నాడు సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారు. నేడు 1050 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడ్డాయి. విద్యా రంగాన్ని గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. నేడు ముఖ్యమంత్రి జగనన్న పాఠశాల రూపురేఖలు మార్చేశారు. తల్లిదండ్రులు సంతోషంగా తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు.

– వీవీ రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు, దొనకొండ

Advertisement
Advertisement