పోలీసుల అదుపులో సైబర్‌ నేరగాడు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో సైబర్‌ నేరగాడు

Published Sun, Jun 11 2023 12:00 AM

-

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ ముఠా సభ్యుడు ఉన్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌కు వివిధ పనుల కోసం నాన్‌ట్రేడ్‌ సిమెంట్‌ అవసరం పడింది. దీని కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయగా బిహర్‌కు చెందిన కుందన్‌ లైన్‌లోకి వచ్చాడు. ప్ర ముఖ కంపెనీకి చెందిన నాన్‌ట్రేడ్‌ సిమెంట్‌ బస్తా ఒక్కంటికి రూ.275లకు సరఫరా చేస్తామని నమ్మించాడు. సదరు కాంట్రాక్టర్‌ గత నెల 10వ తేదీన రూ.2.66 లక్షలు కుందన్‌కు పంపాడు. అయితే 24 గంటల వ్యవధిలో సిమెంట్‌ బస్తాలు సరఫరా చేస్తామన్న నేరగాడు పంపకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ జిల్లా పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఎస్పీ అఖిల్‌మహాజన్‌ చాకచక్యంగా వ్యవహరించి సైబర్‌క్రైమ్‌ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement
Advertisement