కళోత్సవాల్లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

కళోత్సవాల్లో ప్రతిభ

Published Sun, Nov 12 2023 1:12 AM

బహుమతులు సాధించిన   విద్యార్థినులతో ప్రిన్సిపాల్‌ పద్మ
 - Sakshi

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కళోత్సవాల్లో మండలంలోని బద్దెనపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. నృత్యం, శాసీ్త్రయ సంగీతం, ఏకపాత్రాభినయాలలో ప్రతిభ కనబరిచారు. జానపద సంగీతంలో పి.అనన్య, నృత్యంలో డి.స్వాతి, వాయిద్యంలో టి.స్వాతి మొదటి బహుమతి, శాసీ్త్రయ సంగీతంలో సోనా ద్వితీయ బహుమతి, ఏకపాత్రాభినయంలో మానస తృతీయ బహుమతి సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ దర్శనాల పద్మ, ఉపాధ్యాయినులు అభినందించారు.

రంగులు వేసినందుకు ద్విచక్ర వాహనం సీజ్‌

రాయికల్‌: మండలంలోని ఇటిక్యాలకు చెందిన ఓ పార్టీ అభిమాని తన ద్విచక్ర వాహనానికి పార్టీకి సంబంధించిన రంగులు వేశాడు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శనివారం ఆ వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌శాఖకు అప్పగించినట్లు ఎస్సై అజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement