కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలిగా పద్మ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలిగా పద్మ

Published Sun, Nov 12 2023 1:12 AM

ముష్కు పద్మ - Sakshi

చందుర్తి(వేములవాడ): కాంగ్రెస్‌ పార్టీ రాజన్నసిరిసిల్ల జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా ముష్కు పద్మను నియమిస్తూ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చందుర్తి మండలం బండపల్లికి చెందిన ముష్కు పద్మ కాంగ్రెస్‌లో గత పద్దెనిమిదేళ్లుగా పనిచేస్తుంది. గతంలో బండపల్లి ఎంపీటీసీగా, వేములవాడ బ్లాక్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి పదవి అప్పగించిన జిల్లా అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియమాకపత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ చేతుల మీదగా అందుకున్నారు.

Advertisement
Advertisement