తంగళ్లపల్లి(సిరిసిల్ల): దీపావళి పండుగ వేళ మండలకేంద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై సాయంత్రం 11 కేవీ విద్యుత్ తీగ తెగి రోడ్డుపై అడ్డంగా పడింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు విద్యుత్ తీగ ఎవరికీ తాకకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసి మరమ్మతు చేయించడంతో వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.
చిరుతదాడిలో రెండు ఆవులు మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని మద్దిమల్ల లొద్దితండా గ్రామపంచాయతీ పరిధిలో చిరత దాడిలో భూక్య మురళికి చెందిన రెండు ఆవులు చనిపోయాయి. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిచూడగా చిరుత దాడి చేసినట్లు గుర్తించాడు. ఫారెస్ట్ అఽధికారులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.