భద్రతా భావాన్ని కలిగించాలి | Sakshi
Sakshi News home page

భద్రతా భావాన్ని కలిగించాలి

Published Fri, Nov 17 2023 12:50 AM

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ - Sakshi

కోనరావుపేట: పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల, నిజామాబాద్‌, బావుసాయిపేట, నిమ్మపల్లి, కోనరావుపేట, మల్కపేట గ్రామాల్లోని క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. భద్రత చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక వసతులను ముందుగానే చూసుకోవాలన్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో వీలైనంత ఎక్కువసార్లు ఫ్లాగ్‌మార్చ్‌, రూట్‌మార్చ్‌, వాహనాల తనిఖీ చేపట్టి ఓటర్లకు భద్రత భావాన్ని కలిగించాలని సూచించారు. అనంతరం కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్‌ తేదీ దగ్గరనపడుతున్న సమయంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement