జోనల్‌స్థాయి షటిల్‌ పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

జోనల్‌స్థాయి షటిల్‌ పోటీలకు ఎంపిక

Published Sun, Nov 19 2023 1:26 AM

మణికంఠను అభినందిస్తున్న హెచ్‌ఎం, పీఈటీ
 - Sakshi

బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అండర్‌–17 జోనల్‌ స్థాయి పోటీలకు మండలంలోని విలాసాగర్‌ హైస్కూల్‌ విద్యార్థి గోనెపల్లి మణికంఠ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు బొలగం శ్రీనివాస్‌, పీఈటీ తోకల మధుకర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 17న సిరిసిల్లలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచాడు. ఈసందర్భంగా మణికంఠను పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, శోభారాణి, వెంకటహనుమాన్‌, సురేందర్‌రెడ్డి, మధుసూదన్‌, జ్యోష్ణారాణి, ప్రకాశ్‌, రాధిక, మోహనకృష్ణ, వసుంధర, శమంతకమణి, జూనియర్‌ అసిస్టెంట్‌ ఫషియొద్దీన్‌ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement