రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Published Thu, Feb 22 2024 1:36 AM

సతీశ్‌ (ఫైల్‌),  ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన బైక్‌ 
 - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌ శివారులోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం భావ్‌సింగ్‌తండాకు చెందిన భూక్య సతీశ్‌(19), భూక్య సాయిరాం బైక్‌పై మాచారెడ్డి నుంచి రాచర్లగొల్లపల్లికి వస్తున్నారు. రాచర్లబొప్పాపూర్‌ శివారులో ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌తోపాటు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో సతీశ్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరొకరు సాయిరాం తీవ్రంగా గాయపడగా.. స్థానికులు, బ్లూకోర్టు కానిస్టేబుల్‌ సతీశ్‌ కలిసి ఆస్పత్రికి తరలించారు. సతీశ్‌ మరణంతో భావ్‌సింగ్‌తండాలో విషాదం అలుముకుంది. మృతునికి తల్లితండ్రులు మంజుల–రాజు, సోదరి జ్యోతి ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రమాకాంత్‌ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరొకరికి తీవ్ర గాయాలు

కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదం

ఇసుక ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన బైక్‌

1/1

Advertisement
Advertisement