Sakshi News home page

ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి

Published Tue, Nov 14 2023 4:26 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాకు విచ్చేసిన సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకుల ఫోన్‌ నంబర్లు, వివరాలను వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కడం, ఇందులో భాగంగా నగదు, మద్యం పంపిణీ చేయడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలపై, సాధారణ ప్రజలే కాకుండా ఆయా పార్టీల అభ్యర్థులు సైతం ఫిర్యాదు చేయొచ్చని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement