ఆమనగల్లు: శాసనసభ ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని అదనపు డీసీపీ నర్సింహారెడ్డి కోరారు. బుధవారం మండల పరిధిలోని మంగళపల్లి, శెట్టిపల్లి, ఆకుతోటపల్లి, చింతలపల్లి గ్రామాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఈనెల 30న నిర్వహించే ఎన్నికల నిర్వహణకు ఓటర్లు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా అల్లర్లకు పాల్పడిన, రెచ్చగొట్టినా, పోలీసు విధులకు ఆటంకం కలిగించినా.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా గొడవపడే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ నమోదు చేస్తామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బలరాం, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు డీసీపీ నర్సింహారెడ్డి