‘కారు’ పార్టీలోకి కవితాదేవి | Sakshi
Sakshi News home page

‘కారు’ పార్టీలోకి కవితాదేవి

Published Thu, Nov 16 2023 6:22 AM

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: వైఎస్సార్‌ టీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కవితాదేవి కారెక్కారు. బుధవారం ఆమె నగరంలోని మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆమెకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవితాదేవి మాట్లాడుతూ.. పదేళ్లుగా వైఎస్సార్‌టీపీలో చురుకై న నాయకురాలిగా పనిచేశానన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలినై బీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.

నామినేషన్‌ ఉపసంహరణ

అత్తాపూర్‌: రాజేంద్రనగర్‌ నియోజవర్గంలో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు రాజేంద్రనగర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మల్లయ్య తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 26 మంది అభ్యర్థులుండగా.. బుధవారం స్వతంత్ర అభ్యర్థి సాధిక్‌ బిన్‌ యూసుఫ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడన్నారు. ప్రస్తుతం 25 మంది ఎన్నికల బరిలో ఉన్నారని వివరించారు.

Advertisement
Advertisement