రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Thu, Nov 16 2023 6:22 AM

సురేష్‌ మృతదేహం   - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన అంజ సురేష్‌(49) లోకయుక్త డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రోజూవారీ విధుల్లో భాగంగా బుధవారం తపాలాలను తీసుకుని చంద్రాయణగుట్టకు మైలార్‌దేవ్‌పల్లి కల్లు కంపౌండ్‌ ప్రధాన రహదారి గుండా ప్రభుత్వ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారులో వస్తున్న నవీన్‌కుమార్‌ అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement