ఆర్టీసీ కార్మికుల సంబురాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సంబురాలు

Published Wed, Dec 6 2023 6:22 AM

-

అనంతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రానున్న నేపథ్యంలో మంగళవారం వికారాబాద్‌ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారని పేర్కొన్నారు. అలాగే కార్మికులకు రావాల్సిన బకాయిలు, 2017, 2021 సంబంధించి వేతన సవరణ బిల్లులు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పదవి చేపట్టనున్న రేవంత్‌రెడ్డికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబుకు, వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌కుమార్‌కు వికారాబాద్‌ డిపో కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌, టీజేఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కావలి హన్మంతు ముదిరాజ్‌, డిపో ఉద్యోగులు గోపాల్‌, రుక్మయ్య, అశోక్‌, వసంత్‌ గౌడ్‌, వెంకటేష్‌, దయాకర్‌, మనోహర్‌, ఎల్లయ్య, రవి, అంజయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement