చికిత్స పొందుతున్న వృద్ధుడు.. | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వృద్ధుడు..

Published Sat, Apr 8 2023 4:52 AM

-

చేర్యాల (సిద్దిపేట): మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన దివ్యాంగ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు దివ్యాంగుడు కావడంతో ఇంట్లోనే ఉండేవాడు. తాను ఏపని చేయలేకపోతున్నానని భాదపడేవాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. మృతుడి కుమారుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త్నుట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement