జహీరాబాద్: ఈనెల 3వ తేదీన కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల జహీరాబాద్కు రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జహీరాబాద్ చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం సంగారెడ్డికి వెళతారు. అక్కడ జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరి చేరుకుంటారు.
రాష్ట్ర సాధనలోఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకం
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్
సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యన్.సుదర్శన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆర్టీసీ డిపోలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల కృషి, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి ఉద్యోగులు కృషిచేయాలన్నారు.
ఎస్పీ కార్యాలయంలోఘనంగా సంబురాలు
సంగారెడ్డి మున్సిపాలిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రమణ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉషావిశ్వనాథ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్డీఎస్పీ జనార్ధన్, ఎస్బి ఇన్స్పక్టర్ మహేష్ గౌడ్, డీసీఆర్బి ఇన్స్పెపక్టర్ రమేష్, డీపీఓ సూపరింటెండెంట్ వెంకటేశం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతితో
బాధ్యత పెరుగుతుంది
పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి
పటాన్చెరు టౌన్: పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుందని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి అన్నారు. పటాన్ చెరు డీఎస్పీ కార్యాలయంలో పటాన్చెరు సీఐ వేణు గోపాల్ రెడ్డి, క్రైం సీఐ లాలూ నాయక్తో కలిసి ఎస్ఐగా పదోన్నతు పొందిన శ్రీనివాస్ గౌడ్కు, ఏఎస్ఐగా పదోన్నత పొందిన రామ్ మోహన్, నారాయణ, వీవీఎస్ఎన్ రాజు స్టార్ పెట్టారు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నరేశ్ కుమార్, మన్సూర్ ఖాన్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. వారికి ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డి స్టార్స్పెట్టారు.