Sakshi News home page

నేను మరణించలేదు..! అందరినీ చూస్తున్నా..!!

Published Tue, Sep 12 2023 5:40 AM

- - Sakshi

సంగారెడ్డి: బ్రెయిన్‌డెడ్‌ అయి ఓ యువకుడు మృతిచెందగా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని నేత్రాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మజీద్‌పల్లికి చెందిన బబ్బూరి రాజులుగౌడ్‌(36) ఓ ప్రైవేట్‌ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూడు రోజుల కిత్రం బాత్రూంలో స్నానం చేస్తూ కళ్లు తిరిగి కిందపడిపోయాడు. అతన్ని వెంటనే గజ్వేల్‌కు, ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌ అయి రాజులుగౌడ్‌ మృతి చెందాడు. ఆ బాధను దిగమింగుతూ మృతుడి నేత్రాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులు నేత్రాలు తీసుకెళ్లారు. మృతుడు స్వయంగా మజీద్‌పల్లి గ్రామసర్పంచ్‌ లత భర్త శివరాములుగౌడ్‌కు సోదరుడు. కాగా, సోమవారం టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement

What’s your opinion

Advertisement