మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Published Thu, Sep 21 2023 4:32 AM

-

గజ్వేల్‌రూరల్‌: అనారోగ్య సమస్యలు తాళలేక ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని పిడిచెడ్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బీమనమైన లక్ష్మి(36)–సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కు టుంబీకులు నగరంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement