తోట సతీష్‌కు జాతీయ యోగ పురస్కారం | Sakshi
Sakshi News home page

తోట సతీష్‌కు జాతీయ యోగ పురస్కారం

Published Fri, Nov 10 2023 6:46 AM

-

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సిద్దిపేటకు చెందిన ప్రముఖ యోగా గురువు తోట సతీశ్‌ ఉత్తమ జాతీయ యోగ టెక్నికల్‌ ఆఫీషియల్‌ (2023) పురస్కారం అందుకున్నట్లు జిల్లా యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట అశోక్‌ గురువారం తెలిపారు. గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడోత్సవాల్లో భాగంగా గురువారం ఈ పురస్కారాన్ని భారత యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ జయదీప్‌ ఆర్య ప్రదానం చేశారని తెలిపారు. సతీశ్‌కు పురస్కారం అందుకోవడంతో జిల్లా లోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement