సిద్దిపేటకమాన్: అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ సోమన్ టెన్జింగ్ భూటియా అన్నారు. శుక్రవారం సిద్దిపేట టూటౌన్ పోలీసు స్టేషన్ను ఆయన సందర్శించారు. సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సీఐ రవికుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని పెద్దకోడూరు, చిన్నకోడూరు, మైలారం, అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఎన్నికల అబ్జర్వర్ జయశ్రీ బోజ్ పరిశీలించారు. వసతుల కల్పనపై ఆరా తీశారు. అనంతరం ఓటర్ స్లిప్పుల పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమెతో పాటు సిద్దిపేట ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ జయలక్ష్మి, ఎస్ఐ సుభాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
నేడు న్యాయ విజ్ఞాన సదస్సు
సిద్దిపేటకమాన్: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం తెలిపారు. శనివారం పట్టణంలోని రవీంద్ర హైస్కూల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రిటర్నింగ్ అధికారి
వాహనం చెకింగ్
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చేగుంట నుంచి మెదక్కు వెళ్తున్న దుబ్బాక నియోజకవర్గ రిటర్నింగ్ జయచంద్రారెడ్డి వాహనాన్ని తనిఖి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ టీం లీడర్ తిరుమలేష్కు ఆయన పలు సూచనలు చేశారు.