వర్గల్(గజ్వేల్): బాలికల స్టేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు సిద్దిపేట జిల్లా వర్గల్ జ్యోతిబా పూలే బాలికల గురుకులం ముస్తాబైంది. వర్గల్ గురుకులం వేదికగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు చెందిన బీసీ గురుకులాల నుంచి దాదాపు 1650 మంది బాలికలు పోటీల కోసం తరలివస్తున్నారు.
క్రీడా ప్రాంగణం రెడీ
ఆటల పోటీల నిర్వహణకు వీలుగా వర్గల్ పూలే గురుకులంలో ఒకే ఆవరణలో ఉన్న డిగ్రీ కళాశాల, పాఠశాల ప్లే గ్రౌండ్లను సిద్ధం చేశారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో కోర్టులు, రన్నింగ్ ట్రాక్లను తీర్చిదిద్దారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాలుగా పోటీలు జరుగుతాయి.
పోటీలు జరిగే క్రీడాంశాలు
విద్యాలయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్లో 100, 200, 400, 800, 1500, 3000 మీటర్ల పరుగు పోటీలు, 100మీటర్లు, 400 మీటర్ల రిలే రేసు నిర్వహిస్తారు. లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్త్రో, చెస్ పోటీలు జరుగుతాయి. బుధవారం ఉదయం నుంచి పోటీలు మొదలవుతాయి.
పూలే గురుకులంలో ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి నాలుగు రోజులపాటు ఆటలు