కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

Published Thu, Nov 23 2023 4:30 AM

-

గజ్వేల్‌రూరల్‌: ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని దిలాల్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన ముదిరాజ్‌ల సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తయ్య, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు జగన్‌, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు కొంటమైన నర్సింలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement