శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేట మండలంలో సోమవారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ఆఽత్మీయ సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మండల పరిధి చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధిలో నర్సాపూర్ నియోజకవర్గంకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ శ్రేణులు ఎర్పాట్లు చేస్తున్నారు. వేదిక, సభా ప్రాంగణాన్ని ఏఐసీసీ కార్యదర్శి, రాయపూర్ ఎమ్మెల్యే వికాస్ ఉపాధ్యాయ ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు శేషసాయిరెడ్డి, చింతల కర్ణాకర్రెడ్డి, నవీన్గుప్తా, కమల, శ్రీనివాస్గౌడ్, గణేశ్, రవిగౌడ్ తదితరులు ఉన్నారు.