ప్రమాదవశాత్తు | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు

Published Sat, Dec 9 2023 5:00 AM

-

బస్సు దగ్ధం

మునిపల్లి(అందోల్‌): ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైన సంఘటన మండలంలోని బుదేరా గ్రామ శివారులో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ నుంచి షిరిడి వెళ్తున్న ఎస్‌వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు మునిపల్లి మండలం బుదేరా మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగానే బస్సులో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. దీంతో గమనించిన డ్రైవర్‌, క్లీనర్‌ బస్సు వెనకభాగం చూడగా మంటలు ఉండడంతో బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారు. బస్సు డ్రైవర్‌ సుభాష్‌ డిగే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement