పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

Published Fri, Dec 15 2023 4:42 AM

సభ్యత్వం నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయులు  - Sakshi

సిద్దిపేటరూరల్‌: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కనకయ్య, జిల్లా అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి అన్నారు. నారాయణరావుపేట టీపీటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నత పాఠశాలలో ఉన్నతి ప్రోగ్రామ్‌ వల్ల ఉపాధ్యాయులకు పేపర్‌ వర్క్‌తో తరగతి గదిలో బోధనకు ఆటంకం కలుగుతుందన్నారు. ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌లపై మరోసారి ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు, డీసీఈబీ అధికారి, జక్కాపూర్‌ ప్రధాన ఉపాధ్యాయులు షౌకత్‌ అలీ, నాగరాజు, మండల అధ్యక్షుడు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి మనోహర్‌, పీ. ఎల్లం, రాజేశ్వరి, స్వరూప, పద్మ, లలిత భవానీ, అశోక్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కనకయ్య

Advertisement
Advertisement