సమయపాలన పాటించాలి | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Published Tue, Dec 19 2023 4:22 AM

విద్యార్థులతో డీఈఓ వెంకటేశ్వర్లు  - Sakshi

డీఈఓ వెంకటేశ్వర్లు

మునిపల్లి(అందోల్‌): ప్రతీ విద్యార్థి అంకిత భావంతో చదవాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండలంలోని తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జెడ్పీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో త్వర లో ఇంటర్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. టీచర్లు, ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యనందించాలని ఆదేశించారు. కస్తూర్బా బాలికల పాఠశాలకు టీచర్ల తీరుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement