బావను పొడిచిన బామ్మర్ధి | Sakshi
Sakshi News home page

బావను పొడిచిన బామ్మర్ధి

Published Fri, Feb 2 2024 5:54 AM

-

మనోహరాబాద్‌(తూప్రాన్‌): బావను బామ్మర్ధి కత్తితో పొడిచిన ఘటన మనోహరాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కూచారం గ్రామానికి చెందిన బోంతపల్లి అరుణ్‌, కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన శ్యామలకి రెండేళ్ల కిందట ప్రేమ వివాహమైంది. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో శ్యామల తల్లిగారింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో బావపై బామ్మర్ధి శ్యాంసుందర్‌ కోపం పెంచుకున్నాడు. తన స్నేహితులైన అప్రోజ్‌, చేతన్‌తో కలిసి ఈ నెల 30న కూచారం గ్రా మ శివారులో బావ అరుణ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అరుణ్‌ను చికిత్స కోసం ఆస్పత్రి లో చేర్పించారు. హత్యాయత్నం చేసిన శ్యాంసుందర్‌, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement