వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 6:22 AM

గాయపడ్డ సురేశ్‌ - Sakshi

రామాయంపేట(మెదక్‌): మండలంలోని అక్కన్నపేట గ్రామశివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బుధవారం కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం సురేశ్‌ బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో హవేలిఘనపూర్‌ మండలం రాజ్‌పేటకు చెందిన దుర్గాప్రసాద్‌ బైక్‌పై రామాయంపేట వస్తున్నాడు. వారిద్దరి బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సిద్దిపేటకమాన్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎల్లయ్య (42) బైక్‌పై పట్టణ శివారు నాగదేవత టెంపుల్‌ నుంచి సిరిసిల్ల బైపాస్‌లో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గంమధ్యలో టిప్పర్‌ ఢీకొనడంతో ఎల్లయ్య గాయపడ్డాడు. 108 అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ దుర్గాప్రసాద్‌
1/1

గాయపడ్డ దుర్గాప్రసాద్‌

Advertisement
 
Advertisement