మూడోసారి 75 వేల మెజార్టీ ఖాయం | Sakshi
Sakshi News home page

మూడోసారి 75 వేల మెజార్టీ ఖాయం

Published Tue, Sep 12 2023 5:42 AM

క్యూ లైన్ల నిర్మాణ పనులను 
పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - Sakshi

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

కొమురవెల్లి (సిద్దిపేట): వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా 75 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మల్లన్న ఆలయంలో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించారు. అలాగే.. మండలంలోని పోసాన్‌ పల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు భూమి పూజ, రసులాబాద్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దేశానికి ప్రధా ని కావడం ఖాయమన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీపీ తలారి కీర్తన, ఎంపీడీఓ అనురాధ, ఆర్‌ఐ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సిద్ద ప్ప, చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేశం, సర్పంచ్‌ స్వామి, ఉప సర్పంచ్‌ సురేష్‌, కార్యదర్శి కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement