2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీస్లు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన గొడుగులను చిరువ్యాపారులు వాడుతుండటంతో వాటిని అధికారులు తొలగిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ఎటు చూసినా చెకింగ్లు కనిపిస్తున్నాయి. ప్రముఖ న్యాయవాది దేవునూరి రవీందర్ వాహనాన్ని తనిఖీ కోసం పోలీస్లు ఆపగానే పూర్తిగా సహకరించారు. కోటిలింగాల ఆలయం ఆవరణలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళ ఎండ నుంచి రక్షించుకునేందుకు ఓ పార్టీకి సంబంధించిన గొడుగు వాడుతుండటంతో అధికారులు తొలగించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట.