ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలే | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలే

Published Sat, Nov 18 2023 6:36 AM

పెద్దకోడూరులో మహిళలను ఓటు అభ్యర్థిస్తున్న దృశ్యం 
 - Sakshi

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శర్మ

చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్‌, బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దకోడూరులో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు కుల సంఘాలు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని కేవలం పదేళ్లలోనే కేసీఆర్‌ పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్‌ వారంటీ లేని గ్యారంటీలను ప్రజలు నమ్మరన్నారు. ప్రచారంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, ఏఎంసీ చైర్మన్‌ వనిత, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ లింగమూర్తి, ఎంపీటీసీ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement