ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ధ్యేయం | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ధ్యేయం

Published Sat, Nov 18 2023 6:36 AM

సిబ్బందిని సన్మానిస్తున్న డిపో మేనేజర్‌ సురేఖ తదితరులు   - Sakshi

గజ్వేల్‌రూరల్‌: ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ధ్యేయమని జీపీపీ(గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌) డిపో మేనేజర్‌ సురేఖ పేర్కొన్నారు. రోడ్‌ సేఫ్టీ డేని పురస్కరించుకొని శుక్రవారం డిపోలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉమాశశితో కలిసి డిపో పరిధిలోని ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 26 ఏళ్లుగా ఒక్క ప్రమాదం జరగకుండా విధులు నిర్వహించిన ఎండి మోసిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతి చక్రం పురస్కారాలు, మెకానిక్‌ సెక్షన్‌లో సేవలందిస్తున్న పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement