గజ్వేల్‌లో ధర్మమే గెలుస్తుంది | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌లో ధర్మమే గెలుస్తుంది

Published Fri, Dec 1 2023 7:14 AM

సిద్దిపేట రూరల్‌: వృద్ధురాలిని తీసుకువస్తూ.. - Sakshi

ఓటర్లు చైతన్యవంతులు: ఈటల

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): గజ్వేల్‌ ఓటర్లు చైతన్యవంతులని, గజ్వేల్‌లో ధర్మమే గెలుస్తుందని గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం జగదేవ్‌పూర్‌, అలిరాజ్‌పేట గ్రామాల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్‌ ప్రజలు చాలా చైతన్యవంతులని, ప్రతి ఒక్కరూ కథానాయకులై పనిచేశారని తెలిపారు. మూడో తేదీన గజ్వేల్‌ గడ్డపై బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగదేవ్‌పూర్‌లో ఈటల కారు దిగగానే బీఆర్‌ఎస్‌ నాయకులు జై తెలంగాణ నినాదాలు చేయగా వారికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఇరువురిని పోలీసులు చెదరగొట్టారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ప్రసాద్‌రావు, సురేశ్‌, నాగరాజు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జగదేవ్‌పూర్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌
1/1

జగదేవ్‌పూర్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

Advertisement
Advertisement