క్వార్టర్స్‌లో బోపన్న జోడీ  | Sakshi
Sakshi News home page

ATP Tel Aviv Open: క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 

Published Thu, Sep 29 2022 9:41 AM

Bopanna Middelkoop pair reaches Tell aven Atp Quarter Finals - Sakshi

న్యూఢిల్లీ: టెల్‌ అవీవ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ శుభారంభం చేసింది. బుధవారం ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ ద్వయం 4–6, 7–6 (7/4), 10–6తో వైషయ్‌ ఒలియెల్‌ (ఇజ్రాయెల్‌)–మెద్‌జెదోవిచ్‌ (సెర్బియా) జోడీ పై గెలిచింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.
చదవండిVietnam Open Badminton: ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ జోడీ

Advertisement
Advertisement