BWF World Badmintonship 2022: MR Arjun Dhruv And Kapila Enters Into Quarterfinals - Sakshi
Sakshi News home page

BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌- అర్జున్‌ జోడీ.. తొలిసారిగా..

Published Thu, Aug 25 2022 12:34 PM

BWF World Badmintonship 2022: MR Arjun Dhruv Kapila Enters Into Quarterfinals - Sakshi

MR Arjun- Dhruv Kapila: భారత షట్లర్లు ధ్రువ్‌ కపిల- ఎం.ఆర్‌ అర్జున్‌ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్‌ జోడీతో తలపడింది. 

ఈ మ్యాచ్‌లో హీ యోంగ్‌ కాయ్‌ టెరీ–లో కీన్‌ హీన్‌ జంటను ఓడించింది. మొదటి గేమ్‌లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్‌లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్‌ కపిల- ఎం. ఆర్‌ అర్జున్‌ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 

ఇక అంతకు ముందు రెండో రౌండ్‌లో ధ్రువ్‌ కపిల–ఎం.ఆర్‌.అర్జున్‌(అన్‌సీడెడ్‌) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ జోడీ కిమ్‌ ఆస్‌ట్రప్‌–ఆండెర్స్‌ రస్‌ముసెన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి​ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్‌ ఫైనల్లో ధ్రువ్‌- అర్జున్‌.. మూడో సీడ్‌ ఇండోనేషియా ద్వయం మహ్మద్‌ అహ్సాన్‌, హెండ్రా సెటీవాన్‌తో తలపడనున్నారు. 

చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్‌ కీలక నిర్ణయం!
Asia Cup 2022 Ind Vs Pak: బాబర్‌ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్‌! రషీద్‌తోనూ ముచ్చట!

Advertisement
Advertisement