జీవన్‌–అర్జున్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌    | Sakshi
Sakshi News home page

జీవన్‌–అర్జున్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌   

Published Mon, Apr 15 2024 2:39 AM

Doubles title for Jeevan and Arjun pair - Sakshi

మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీలో భారత్‌కు చెందిన జీవన్‌ నెడున్‌జెళియన్‌–అర్జున్‌ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో జీవన్‌–అర్జున్‌ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్‌ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్‌)–రోమియోస్‌ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్‌–అర్జున్‌ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ,75 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
Advertisement