డబ్ల్యూటీసీ: రౌండ్‌ 4కు సిద్ధం | Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీసీ: రౌండ్‌ 4కు సిద్ధం

Published Wed, Mar 3 2021 8:40 PM

ICC Hillarious Tweet About India Vs England 4th Test Who Go WTC Final - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుపైనే ఇప్పడు అందరి కళ్లు నెలకొన్నాయి. విషయం ఏంటో ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా లేక డ్రా చేసుకున్నా నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. లార్డ్స్ వేదికగా జూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ విజయం సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియా‌.. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు సిద్ధమవుతుంది. దీంతో టీమిండియాకు నాలుగో టెస్టు  కీలకంగా మారింది. 

ఈ నేపథ్యంలో ఐసీసీ ఒక ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోలో బాక్సింగ్‌ రింగ్‌ను చూపిస్తూ టీమిండియా, ఇంగ్లండ్‌లు నాలుగో రౌండ్‌కు సమాయత్తమవుతున్నట్లుగా ఉంది. రింగ్‌లో ఒకవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జోష్‌తో కనిపిస్తూ బౌట్‌కు సిద్ధమవుతుండగా.. మరోవైపు జో రూట్‌ మాత్రం వరుసగా రెండు టెస్టుల ఓడిపోయి డీలా పడినట్లు కనిపిస్తుంది. అయితే ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ మాత్రం రూట్‌ పక్కనే నిలబడి గెలవాలంటూ అతనికి ఎంకరేజ్‌ చేస్తున్నాడు.

ఇక రింగ్‌ బయట కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సంతోషంగా కనిపిస్తూనే వీళ్లలో ఎవరు మనతో ఫైనల్‌ ఆడబోతున్నారనే దానిపై తన సహచరుడితో చర్చిస్తున్నట్లు చూపించారు. మొత్తానికి ఫైనల్‌ రౌండ్‌కు వెళ్లాలంటే ముందు నాలుగో రౌండ్‌ ఎవరు గెలుస్తారో చూడాలి. ''అంటూ ఐసీసీ పేర్కొంది. ''రౌండ్‌ నెంబర్‌ 4కు సిద్ధం.. డబ్ల్యూటిసీ 21'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఐసీసీ షేర్‌ చేసిన ఆ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో స్పందించారు. ''డబ్య్లూటీసీ ఫైనల్‌ కచ్చితంగా ఇండియా,న్యూజిలాండ్‌ తలపడుతాయి.. పాపం పైన్‌.. చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు.. కోహ్లి జోష్‌లో ఉంటే .. రూట్‌ మాత్రం '' అంటూ కామెంట్లు తెలిపారు.
చదవండి: 
'మ్యాచ్‌ను 5 రోజుల వరకు తీసుకెళ్లలేం'
'రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉంటుందంటావు!'

Advertisement
Advertisement