క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం స్పెయిన్‌తో భారత్‌ పోరు | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం స్పెయిన్‌తో భారత్‌ పోరు

Published Sat, Jul 9 2022 2:49 AM

India scrape into crossovers - Sakshi

ప్రపంచకప్‌ మహిళల హాకీ టోర్నీలో ఆదివారం జరిగే ‘క్రాస్‌ ఓవర్‌’ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ ఆడుతుంది. గెలిచిన జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుతుంది.  న్యూజిలాండ్‌తో జరిగిన పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో సవితా పూనియా కెప్టెన్సీలోని టీమిండియా 3–4తో ఓడిపోయింది.

అయితే ఇంగ్లండ్‌ జట్టు చేతిలో చైనా కూడా ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. భారత్, చైనా రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్‌ అంతరంతో భారత్‌ మూడో స్థానంలో నిలిచి  ‘క్రాస్‌ ఓవర్‌’ మ్యాచ్‌కు అర్హత సాధించింది.

Advertisement
Advertisement