Jasprit Bumrah To Lead India In Ireland T20I Series - Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌, రింకూ సింగ్‌కు పిలుపు

Published Mon, Jul 31 2023 9:11 PM

Jasprit Bumrah To Lead India In Ireland T20I Series - Sakshi

ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇవాళ (జులై 31) ప్రకటించారు. ఈ జట్టుకు భారత సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను నియమించారు. దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా.. ఐర్లాండ్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనుండగా.. ఐపీఎల్‌-2023 స్టార్లు రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్‌ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అదరగొట్టిన శివమ్‌ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు కూడా రెస్ట్‌ ఇచ్చారు. 

కాగా, విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం టీమిండియా ఆగస్ట్‌ 18 నుంచి ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులోని తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఐర్లాండ్‌ సిరీస్‌కు కూడా ఎంపికయ్యారు. ఈ ఏడుగురు క్రికెటర్లు విండీస్‌ నుంచి నేరుగా ఐర్లాండ్‌కు బయల్దేరతారు.   

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
 

Advertisement
Advertisement