ఏడాది తర్వాత ‘రింగ్‌’లోకి మేరీకోమ్‌ | Sakshi
Sakshi News home page

ఏడాది తర్వాత ‘రింగ్‌’లోకి మేరీకోమ్‌

Published Mon, Mar 1 2021 2:08 PM

Mary Kom To Spearhead 14 Strong Indian Boxing Contingent - Sakshi

న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్, భారత మహిళా మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ ఏడాది విరామం తర్వాత మళ్లీ ‘రింగ్‌’లోకి అడుగు పెట్టనుంది. స్పెయిన్‌లో నేటి నుంచి జరిగే బాక్సమ్‌ అంతర్జాతీయ టోర్నీలో ఆమె 51 కేజీల విభాగంలో పోటీపడనుంది.

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 37 ఏళ్ల మేరీకోమ్‌తోపాటు సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) కూడా ఈ టోరీ్నలో ఆడనున్నారు. 

Advertisement
Advertisement