BWF World Championships 2021: క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
Published
Fri, Dec 17 2021 4:45 PM
స్పెయిన్లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి చెందింది. తైవాన్కు చెందిన వరల్డ్ నెం1 తైజుయింగ్ చేతిలో 21-17,13-21 ఓటమి చెందింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తైజుయింగ్.. సింధుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆరో పతకాన్ని చేజార్చుకుంది. ఇక చైనా స్టార్ షట్లర్ జాంగ్ నింగ్తో ఐదు పతకాలతో సింధు సమంగా నిలిచింది.